सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

గురువు మరియు గోవిందుడు, ఇద్దరూ కలిసిన వేళ

అవంతి మర్ల | అహ్మదాబాద్ | గుజరాత్

parivartan-img

అహ్మదాబాద్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాల ఐదేళ్లుగా దేశంలోని అంతర్జాతీయ జూనియర్ ఫుట్‌బాల్ జట్టు కోసం నలుగురు ప్రతిభావంతులైన ఆటగాళ్లను తయారు చేయడం నిజంగా ఊహించలేనిది. వీరిలో అరుణా చౌహాన్ 2019లో అత్యుత్తమ క్రీడాకారిణిగా ఎంపికైంది. అదే సమయంలో గుజరాత్ ప్రభుత్వం 2012, 2016, 2019లో నిర్వహించిన గణితం, సైన్స్ ఎగ్జిబిషన్‌లో ఈ పాఠశాల పిల్లలు రాష్ట్ర స్థాయిలో తమ సత్తాను చాటుకున్నారు. ప్రఖ్యాత ప్రైవేట్ పాఠశాలలను వెనుకంజ లో ఉంచి థాల్తేజ్ ప్రైమరీ స్కూల్ నెం.1 విద్యార్థులు అహ్మదాబాద్‌లోని సైన్స్ మరియు స్పోర్ట్స్ రంగంలో ప్రకంపనలు సృష్టించారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపి, అడుగడుగునా మార్గనిర్దేశం చేసింది మరెవరో కాదు, ఇదే పాఠశాలలో 2006 నుండి పనిచేస్తూ, ప్రభుత్వం నుండి ఉత్తమ ఉపాధ్యాయునిగా గౌరవం అందుకున్న సంఘ్ యొక్క స్వయంసేవక్ శ్రీ మహేష్ భాయ్ ఠక్కర్ గారు. మహేష్ భాయ్ మొదటి నుంచీ, సంఘ్ పద్ధతి ద్వారా విద్యార్థులలో విద్య, సంస్కృతి మరియు జాతీయతా బీజాలను నాటి, విజయవంతమైన వ్యక్తులుగా మరియు దేశభక్తి గల పౌరులుగా మారేలా స్ఫూర్తినిస్తూ ప్రేరేపించారు. మహేష్ భాయ్ పని చేస్తున్న సమయంలో భోపాల్ ప్రభుత్వ పాఠశాల పిల్లలు చరిత్ర సృష్టించారు. ఉత్తమమైన మట్టి ఫ్రిజ్‌ని తయారు చేయడం ద్వారా2003 ఉర్జా ఉత్సవ్‌లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారిచే సత్కరింప బడ్డారు.



ఉపాధ్యాయునిగా ఉండటం కారణంగా 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు విజ్ఞానం, ఉచిత విద్య అందించి , ఎంతో మంది కూలీలు, మురికివాడల పిల్లలు బడికి వెళ్లేలా స్ఫూర్తిని నింపడమే కాకుండా పిల్లల తల్లిదండ్రులను కూడా ప్రోత్సహించారు, దీంతో పాటు పిల్లల తల్లిదండ్రులకు వ్యసనరహిత జీవితాన్ని గడపడానికి క్రమం తప్పకుండా కౌన్సెలింగ్ కూడా ఇచ్చేవారు. 2000 సంవత్సరంలో పటాన్ జిల్లా దాతర్వాడ గ్రామంలో ఉపాధ్యాయుడిగా ఉంటూనే నషా ముక్త్ జాగరణ్ అభియాన్ కింద దాతర్వాడ గ్రామం మొత్తాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడంలో కీలక పాత్ర పోషించారు. భగవంతుడు ప్రతి చిన్నారిలో ఏదో ఒక అద్భుతాన్ని, ప్రత్యేక శక్తిని మరియు సామర్ధ్యాన్ని ఇస్తాడు. శిక్షణ మరియు ప్రతిభ యొక్క కీర్తిని గుర్తించడానికి మాత్రం గురువు యొక్క సహాయం కావలి. ఆరో తరగతి లో చేరవలసిన సంగీత ప్రజాపతి అడ్మిషన్, మానసిక బలహీనత కారణంగా ఏ పాఠశాలలోనూ జరగలేదు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి మహేశ్ భాయ్ ప్రిన్సిపాల్‌తో మాట్లాడి సంగీత బాధ్యతను తీసుకుని ఆమెకు పెయింటింగ్‌పై ఉన్న ఆసక్తిని గుర్తించి ప్రోత్సహించారు. ఎనిమిదో తరగతి పాస్ అయ్యేసరికి సంగీత పూర్తిగా మాములుగా అయిపోయింది. సంగీత యొక్క వినూత్న ప్రాజెక్ట్‌ను IIM తన సైట్‌లో ఉంచింది. 10వ తరగతి పాస్ అయిన సంగీత డ్రాయింగ్ టీచర్ కావాలని కలలు కంటోంది.



అహ్మదాబాద్‌లోని అన్ని పోటీ పరీక్షలలో ఈ పిల్లల ప్రతిభను ఎలా వెలికి తీయాలి? అనే ఆలోచన మరియు ఉద్దేశంతో, మహేష్ భాయ్ తన పాఠశాలలో 5 నుండి 8 తరగతుల పిల్లలందరి కోసం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాడు, 2012లో గ్రామంలోని ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివి శాస్త్రవేత్తగా మారిన శ్రీ కనక్‌భాయ్ పటేల్ సహాయంతో 'కమలా బా ఉచిత ట్యూషన్ సెంటర్‌" ను ప్రారంభించారు. సేవా బస్తీలో రేషన్‌ పంపిణీ చేసేందుకు ప్రయాస్‌ క్లబ్‌ సభ్యులు నలుగురు మహిళలు  వఛ్చి మహేశ్‌భాయ్‌ ద్వారా ప్రభావితులై అక్కడే ఉచితంగా తమ సమయాన్ని  ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

 ఈరోజు ప్రయాస్ క్లబ్‌కు చెందిన 43 మంది మహిళలు ఈ సెంటర్‌లోనే సైన్స్, గణితం, హిందీ, ఇంగ్లీష్, కంప్యూటర్, పెయింటింగ్ వంటి అన్ని సబ్జెక్టులను ఉచితంగా భోదించడమే కాకుండా ఆ పిల్లల ప్రతీ అవసరాన్ని కూడా చూసుకుంటున్నారు. ఎటువంటి విరామం లేకుండా ఏడాది పొడవునా నడుస్తున్న ఈ ట్యూషన్ సెంటర్ పూర్తి ఉచితం గా బోధించబడుతున్నది. సైద్ధాంతిక పరిజ్ఞానంతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం ఈ పిల్లలందరినీ సుందర్‌బన్స్, ఇస్రో, సైన్స్ సిటీ, సెరినిటీ బొటానికల్ గార్డెన్ మొదలైన ప్రదేశాలకు ఏడాదికి అనేక సార్లు ఉచిత విహారయాత్రలకు తీసుకెళ్తుంటారు. మహేష్ భాయ్ ఉదేశ్యం లో "చెప్పులు కుట్టేవాడు ,తన చూపు ఎలా అయితే బూట్లపై ఓ కన్నేసి ఉంచుతాడో ,అలాగే ఒక గురువు కూడా తమ పిల్లల యొక్క ప్రతిభ పైనే  దృష్టి పెట్టాలి. 2011 నుండి నిరంతరంగా సైన్స్ ప్రాజెక్టులకు ప్రమాణాలుగా ప్రతి సంవత్సరం 15-16 మంది విద్యార్థులను ఎంపిక చేస్తారు. వారంలో ఒక్క రోజు తమ గుడిసెల నుండి బయటకు వచ్చి సంపన్న కుటుంబాల పిల్లలతో కలిసి పూర్తి గౌరవంతో భుజం భుజం కలిపి విక్రమ్ సారాభాయ్ విజ్ఞాన కేంద్రంలోని ల్యాబ్‌లో వివిధ ప్రయోగాలు చేస్తారు. ప్రతి విద్యార్థి తన తరగతిలోని సుమారు 40 మంది పిల్లలకు ఉపాధ్యాయుడిగా మారడం ద్వారా తన జ్ఞానాన్ని పంచుకుంటాడు. సైన్స్ సెంటర్‌తో అనుబంధించబడిన పిల్లల ఖర్చులన్నింటినీ శాస్త్రవేత్తలు మరియు స్వచ్ఛంద సంస్థలు భరిస్తాయి. విద్య అనేది ప్రభుత్వంపైనే కాకుండా సమాజంపై కూడా ఆధారపడి ఉండాలన్న మహేష్ భాయ్ ఆలోచనకు 27 స్వచ్ఛంద సంస్థల మద్దతు లభించింది. వారి ద్వారానే ఈ పిల్లల అవసరాలన్నీ తీరుతున్నాయి. 2016లో 8వ తరగతి ఉత్తీర్ణులై అంతర్జాతీయ స్థాయిలో సందడి చేసిన జూనియర్ బాలికల జట్టు నేడు విశ్వ భారతి శాల థాల్తేజ్‌కు గర్వకారణం. నేడు స్వీడన్‌కు చెందిన SKF సంస్థ సహకారంతో సైన్స్‌, కంప్యూటర్‌, యోగా తరగతుల్లో జ్ఞానాన్ని పొందుతూ రాష్ట్ర స్థాయిలో హిందీ, డ్రాయింగ్‌ పోటీల్లో పాల్గొంటున్న ఈ చిన్నారుల ఆశయాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇందులో పాల్గొంటున్న చిన్నారులు ప్రతి రంగంలోనూ తమ సత్తా చాటుతున్నారు. పిల్లలు చదువు కొనసాగించేందుకు పేదరికం అడ్డంకిగా మారకుండా చూసేందుకు, 8వ తరగతి ఉత్తీర్ణులైన ప్రతి చిన్నారిని ట్రాక్ చేయడం ద్వారా జీరో డ్రాపౌట్ లక్ష్యాన్ని సాధించారు. పిల్లలు మరియు తల్లిదండ్రులు నిరంతరం మహేష్ భాయ్‌తో కాంటాక్ట్‌లో ఉంటారు. కోవిడ్ కారణంగా 10 మరియు 12 తరగతుల పరీక్షలు ఇచ్చిన తరువాత పిల్లల ముందు పెద్ద సంక్షోభం ఏర్పడింది, తాము ఏ దిశలో వెళ్ళాలి? వారికీ ఆసక్తి ఉన్న రంగాల్లోకి వెళ్లేందుకు అంత డబ్బు ఎక్కడి నుంచి పొందాలి? వారు టీచర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఇంజనీర్ కావాలని కోరుకున్నారు. గత జూన్‌లో ఈ పిల్లలను ఒకచోట చేర్చి ఒక మానసిక సలహాదారు సహాయంతో, మేధోపరమైన సాధన మరియు విద్యావిషయక సాధన కోసం తనిఖీ చేశారు. అనేక దశల సమావేశాన్ని పూర్తి చేసిన తర్వాత, వారికి మార్గనిర్దేశం చేయడమే కాకుండా, తదుపరి పోటీ పరీక్షల తయారీకి మరియు ప్రవేశం తర్వాత వారి ఫీజుల కోసం 16 మంది బాలికలకు మద్దతు ఇచ్చారు. ఉపాధ్యాయుని జీతం ఎక్కువ కాదు, కానీ అతని ఆలోచన, అతని కృషి మరియు అతని దృక్పథం దేశ భవిష్యత్తుతో అంటే పిల్లలతో పూర్తిగా అనుసంధానించబడి ఉంటే, అప్పుడు సమాజం మాత్రమే కాదు, మొత్తం దేశం యొక్క చిత్రం మారవచ్చు. ఈ విషయాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్త మహేశ్ భాయ్ నిరూపించారు.

333 Views
अगली कहानी