सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

5 mins read

మేము ఉన్నా లేకున్నా భారత దేశం నిరంతరం ప్రవహించాలి

ఆనంద్ కందుకుర్తి | మధ్యప్రదేశ్

parivartan-img

కొన్నిసార్లు కొందరు వ్యక్తులపై కష్టాల పర్వతాలు, భూపాల్ లోని అరోరా కాలనీలో ధనవంతమైన ఈ ప్రాంతంలో కిరాయి ఇంట్లో ఉంటున్న కల్ల్పన విశ్వకర్మ కథ కూడా ఇలాగే అనిపిస్తుంది ఒక కాలు గ్యాంగ్రీన్ కారణంగా చెడిపోయింది. వికలాంగురాలు అయిన కల్పనకు కరోనా అనేక కష్టాలను తెచ్చి పెట్టింది. ఆమె గర్భవతి అయింది. ఆమె మామయ్య ద్వారకా ప్రసాద్ విశ్వకర్మ కరోనా వైరస్ సోకి మృత్యువాత పోరాటం ప్రారంభించారు. మరోవైపు లాక్ డౌన్ వల్ల భర్త ఆటోకి గిరాకీ లేకుండా పోయింది. కడుపులో చిన్న పాప ని పెట్టుకుని తిరుగుతున్న కల్పనకు వాళ్ళ మామ కరోనా ఖర్చును భరించడం కష్టమయ్యింది. ఆమె కూడా తిండి గింజలకు తపించ వలసి వచ్చింది. ఈ పరిస్థితి భూపాల్ కి చెందిన సేవా భారతి మహా నగర మహిళా సంయోజిక ఆభా దీదీ కి తెలిసినప్పుడు కల్పనకు బ్రతుకు పై ఆశ వచ్చింది. సేవ చేయాలని నిర్ణయించుకున్న సేవా భారతి కార్యకర్తలు కల్పన కుటుంబం యొక్క అన్ని బాధ్యతలు నెత్తిన వేసుకున్నారు.

ముందుగా వారు కల్పన మామగారి చికిత్సను చేపట్టారు కానీ అప్పటికే సమయం మించి ఆయన చనిపోయారు. అతని అంతిమ సంస్కారాల నుండి 13వ రోజు వరకు అన్ని కర్మలు సేవా భారతి వారే పూర్తి చేశారు. అంతేకాదు లాక్ డౌన్ పూర్తయ్యేవరకు అన్ని నిత్య అవసరాల సరుకులు ఆమెకు ఇచ్చారు. గర్భవతి కల్పన కు తగిన పోషకాహారం కూడా సరఫరా చేశారు. ఇలాంటి దారుణ వ్యధలలో ఒకటి జ్యోతి కథ . ఆమె 8 ఏళ్ళ కూతురు కేన్సర్ తో బాధ పడుతోంది . ఇండోర్ నగరంలోని బాధ్ కాలనీ లో వుండే చాలా ఇండ్లలో పాచిపని చేసి ఇల్లు నడిపేది . ఆమె భర్త సైకిల్ రిక్షా నడిపే వాడు. లాక్ డౌన్ వారిరువురి పనిని మింగేసింది. క్యాన్సర్ తో బాధపడే పిల్లకు వైద్యం అటు ఉంచి అన్నం పెట్టలేని స్థితికి చేరుకుంది జ్యోతి. ఎవరో చెప్పినందువల్ల ఆమె ఇండోర్ సేవా భారతి హెల్ప్ లైన్ ద్వారా ప్రాంత సేవా భారతి సమయోజిక్ సునీత దీదీ ని దీనంగా సహాయం అర్దించింది. ఆమె పూర్తి బాధ్యత లు సేవాభారతి వాళ్ళు తీసుకొని సహాయం చేశారు. లాక్ డౌన్ సమయంలో నిత్యావసర సరుకులే కాదు అవసరమైన అన్ని సహాయాలు చేశారు. నేటికీ సునీత దీదీ నాడు జ్యోతి ఫోన్ లో అడిగిన సహాయాన్ని ఆర్ధ్రంగా గుర్తు చేసుకుంటారు.


   " నేను ఉన్నా లేకున్నా భారతదేశం నిరంతరం కొనసాగాలి " అని మణికర్ణిక అనే సినిమాలో రాసిన ప్రసిద్ధ గేయం ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుల కోసమే రాయబడింది ఏమో అనిపిస్తుంది."సిద్ధి " జిల్లా కి చెందిన సేవా ప్రముఖ్ ఆశీష్ గారి కథ చదివితే ఈ భావన మనకు కండ్లకు కనబడుతుంది. కరుణ కాలంలో నిరంతరం సేవా కార్యక్రమాల్లో మునిగి తేలిన ఆశిష్ గారు కరోనా పాజిటివ్ అయ్యారు. ఆయన రేవాలోని కుశ భాహు ఠాక్రే ఆసుపత్రిలో ఐసీయూలో చేరి మృత్యువు జీవితానికి మధ్య ఊగిసలాడసాగారు. మహిళా వార్డులో ఒక రోగి అత్యంత దయనీయ స్థితిలో ఆక్సిజన్ కోసం ఎదురు చూస్తున్నదని ఆశిష్ గారికి నర్స్ మాటల్లో తెలిసింది . వెంటనే ఆయన తన సిలిండర్ ని ఆమెకి పంపి తన ప్రాణాలనిప్రమాదంలోపడవేశారు.కర్పూరంతో ఆయన శ్వాసను పీలుస్తూ మూడు గంటలు గడిపారు. ఆ మహిళ కోలుకున్నాక తిరిగి ఆక్సిజన్ సిలిండర్ ఆశిష్ గారికి అమర్చారు. నేడు ఆయనతోపాటు ఆ మహిళ కూడా సంతోషంగా బతికి ఉన్నారు.

మధ్య క్షేత్రం క్షేత్ర కార్యవాహ అశోక్ అగర్వాల్ జీ మాటల్లో చెప్పాలి అంటే "సంపూర్ణ క్షేత్రంలో స్వయం సేవకులు ప్రతి అవసరాలకు సమాజానికి అండగా నిలిచారు . 589 హెల్ప్‌లైన్ సెంటర్ లు, 123 ఐసోలేషన్ కేంద్రాలు, 17 కోవిడ్ కేర్ సెంటర్ లతో పాటు 649 స్థానాల్లో 40,624 భోజన ప్యాకెట్లు వితరణ చేసే పనిలో 11,077 మంది కార్యకర్తలు త్రికరణ శుద్ధిగా పని చేసారు".

       రత్లాం దగ్గరి పంచడ్ గ్రామమ్‌లో 100 శాతం టీకాలు వేయించి సంఘ స్వయం సేవకులు చరిత్ర సృష్టించారు .కరోనా ప్రారంభం అయింది. శాఖలు ఆపేసారు, చూస్తు చూస్తు 30 మంది గ్రామస్తులు చనిపోయారు. శాఖ స్వయం సేవకులు అప్రమత్తం అయ్యి తమ గ్రామాని కరోనా నుండి సురక్షితంగా ఉంచేందుకు సంపూర్ణంగా పోరాటం చేస్తామని ప్రతిజ్ఞ భూనారు. ముందుగా, వారు గ్రామాన్ని సీల్ చేసారు. ప్రజల్ని, రాకపోకలను నియంత్రించారు. ఫలితం గా కరోనా ఆగిపోయింది. తరువాత ఊరిలో టీకాలు వేసే అర్హులైన వారందర్ని చైతన్య పరచి తక్కువ సమయం లో వ్యాక్సిన్ లు ఇప్పించారు.


కరోనా రెండవ కరోనా రెండవ వేవ్ వ్యాప్తి ధట్టమైన ఆడవుల్లో కూడా కనిపించింది. మధ్యప్రదేశ్ ఖాండవ్ జిల్లాలో కరోనాను ఆపడానికి ఒక కొత్త సఫల ప్రయోగం చేయబడ్డది. ఖాండవ్ విభాగం సేవా ప్రముఖ్ అతుల్ షా చెప్పిన విశేషాలు, వనవాసీలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో వారు ఆసుపత్రికి రావడానికి సిద్ధంగా లేరు, కరోనా పరీక్షలు చేయించడానికి సిద్ధంగా లేరు. జలుబు, దగ్గు, జ్వరంలతో చావుల సంఖ్య నిరంతరం పెరగడం మొదలయింది. ఇండోర్ కి చెందిన ప్రసిద్ధ గోకుల్ దాస్ హాస్పిటల్ ,సీనియర్ డాక్టర్లు ,వనవాసులు ప్రాతంలో పని చేసే స్థానికా డాక్టర్ లకు కరోనా పరీక్షలు చేసే ఆన్‌లైన్ ట్రైనింగ్ ఇచ్చారూ.సేవభారతి వారు టెస్ట్ కిట్లు, కరోనా మందులు ఇచ్చారు.స్వయం సేవకులు ,చివరి రోగి వరకు చేరేలా కృషి చేసారు. ఈ గ్రామీణ డాక్టర్ల ద్వార గుడి, సింగోట, బూరగావ్, గులాయిమాల్, రోషిణి, పటజాన్, జింజిరి, గోల్ ఖేడా, జుమ్మర్‌ఖలీ, మరియు చుట్టు ప్రక్కల గ్రామం లో 14 OPD లు నిరంతరం వనవాసి ప్రాంతాలలో పరీక్షలు, ప్రధమ చికిత్సలు చేసి వేలమంది వనవాసిలను రక్షించారు.

1398 Views
अगली कहानी