सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

సేవకు అంకితమైన భారతీయ మహిళలు

కిషన్ మర్ల | భారతదేశం

parivartan-img

టీబీ వంటి తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న 11 ఏళ్ల సోనూ అనే కుర్రాడు, తన 6 ఏళ్ల సోదరి ఖుష్బూతో కలిసి ఓ చిన్న గదిలో ఎక్కడి నుంచో తెచ్చుకున్న పప్పులో నీళ్లు పోసి ఉడికించేందుకు సిద్ధమవుతున్నాడు. కిషోరి వికాస్ కేంద్రానికి చెందిన అమ్మాయిలతో పాటు రీనా దీదీ రేషన్ కిట్‌తో అతని వద్దకు వెళ్లినప్పుడు, సోనూ ఆనందానికి అవధులు లేవు. ఇది ప్రారంభం మాత్రమే, ఆగ్రాలోని బస్తీలలో నివసిస్తున్న ఈ అనాథ సోదరసోదరీమణుల సంరక్షణతో పాటు వారికి విద్య మరియు వైద్యం అందుబాటులో ఉండేటట్టు ఆగ్రా సేవాభారతి మాతృమండలి సోదరీమణులు పనిచేస్తున్నారు.


వలస కూలీల కుటుంబాల్లోని మహిళలు ఎవరికీ చెప్పుకోలేని దుస్థితిని ఈ మాతృమండలి సోదరీమణులు అర్థం చేసుకున్నారు. పేదరికం, కిలోమీటర్ల మేర కాలినడక, పైగా బహిష్టు సమస్య, ఈ శ్రామిక మహిళల పరిస్థితిని చూసి, సేవా భారతి సంయోజిక ఆగ్రా, డాక్టర్ రేణుకా ఉత్సవ్ సహాయంతో, సేవాభారతి మాతృమండలి బౌద్దిక్ ప్రముఖ్ రీనా సింహ్ తో పాటు మమతా సింహ్, సుప్రియా జైన్, అంజలి గౌతమ్, మరియు సుస్మితా సింహ్ లతో కూడిన ఈ బృందం బస్టాండ్‌లు, మురికివాడల్లో నివసించే పేద మహిళలకు ఉచితంగా సానిటరీ నాప్కిన్ పంపిణీ చేయ ప్రారంభించారు, ఆలా ఆగ్రా మరియు చుట్టుపక్కల 127 బస్తీలలో 20,000 మంది మహిళలకు నాప్కిన్లు పంపిణీ చేయబడ్డాయి మరియు కరోనా కాలంలో ఆరోగ్యంగా ఉండటానికి చిట్కాలు కూడా అందరికి వివరించారు.


తల్లి రెక్కలు విప్పితే విశ్వమంతా తనలో లీనమైపోతుంది. దేశవ్యాప్తంగా ఉన్న సేవాభారతి మాతృమండలి లోని మహిళలు కరోనా కాలం నాటి కష్టాలతో సతమతమవుతున్న ప్రజలకు రేషన్ పంపిణీ నుంచి మాస్క్‌లు, పీపీఈ కిట్‌లు సత్తు, ఊరగాయ, పాపడ్, రాఖీలు తయారు చేయటం మరియు కరోనా పాజిటివ్ పేషెంట్ల కోసం హెల్ప్‌లైన్‌ని ఏర్పాటు చేయడం వంటి అనేక పనులు చేశారు.

పదండి త్రిపురలోని ధన్‌పూర్ నివాసి అయిన మీరా సాహ్‌ను కలుద్దాం, ఆమె కరోనా కాలంలో తన భర్త మరణించిన తరువాత స్వయంగా డిప్రెషన్‌తో పోరాడి, "గంగా సేవా సంస్థాన్" ఆధ్వర్యంలో 25 మంది సోదరీమణులకు మాస్క్ లు మరియు ఇతర అవసరమైన బట్టలు కుట్టడంలో శిక్షణ ఇచ్చింది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా మాస్కులు తయారు చేసి, వాటి ద్వారా వారి ఇళ్లలో దీపం వెలిగించారు.

మంగీలాల్ (ఒక బిచ్చగాడు) షోలాపూర్‌లోని ఉద్యోగవర్ధిని వంటిల్లు నుండి ప్రతిరోజూ రూ. 10కి భోజనం  ప్లేట్ తీసుకునేవాడు, కానీ లాక్‌డౌన్ సమయంలో, అతను రెండు ప్లేట్లు తీసుకోవడం ప్రారంభించినప్పుడు, చంద్రికా తాయ్ గమనించి ఆయన తన బిక్షాటన ద్వారా వచ్చిన సంపదతో  ఇతర బిచ్చగాళ్లకు కూడా సహాయం చేయడం చూసారు. ఇది చూసి తల్లి హృదయం కరిగి పోయింది, రాష్ట్రీయ సేవా భారతి ధర్మకర్తల మండలి జాయింట్ సెక్రటరీ అయిన చంద్రికా చౌహాన్ దగ్గర్లో ఉన్న అన్ని దేవాలయాల యాచకులకు, ఊర్లలోని నిస్సహాయ వికలాంగులకు, అలాగే నిస్సహాయ స్థితిలో ఉన్న  వృద్ధులకు ఉచితంగా ఆహారం అందించడం ప్రారంభించారు. లాక్డౌన్ లో ఇది జరిగింది. మార్చి 26 నుండి వరుసగా నాలుగు నెలల పాటు, సేవాభావం కలిగిన మహిళలు 250 మందికి పైగా ప్రజలకు పూర్తి భోజనాన్ని ఉచితంగా మరియు వందలాది మంది వలస కార్మికులకు కేవలం 20 రూపాయలకే భోజనాన్ని అందించారు.

సంఘ్ విలువలతో నిండిన ఈ మహిళల సేవా ప్రయాణం గురించి చర్చిస్తూ, సేవా భారతి జాతీయ ఉపాధ్యక్షురాలు అమిత జైన్, భోపాల్‌కు చెందిన 82 ఏళ్ల హరిదిని జోషి మరియు 80 ఏళ్ల ప్రకాష్ ఖనూజాలను ఉదాహరణగా చెబుతూ వారు ఆ వయసులో కూడా పగలు రాత్రి మాస్క్‌లు కుట్టించి  బస్తీలలో ఉచితంగా పంపిణీ చేశారు అని అన్నారు.

సోదరుడి చెయ్యి బోసిగా ఉండకూడదు అని ఎట్లయితే ఒక సోదరి అనుకుంటుందో ఆ ఆందోళనను తొలగిస్తూ 65 ఏళ్ల ఆర్తి దీదీ, సవితా దీదీ, బుర్హాన్‌పూర్ లోని ఒక సోదరి మేఘా గురించి రాఖీ, బియ్యం మరియు కొబ్బరికాయను ధన్వంతరి కాలనీలోని తన సోదరుడి ఇంటికి బహూకరించారు. ఇలా మాల్వా ప్రాంతంలోని 9 నగరాల్లో, నిరుపేద మహిళలతో రాఖీలు తయారు చేయడం ద్వారా ఆదాయ వనరును అందించడమే కాకుండా, హాట్‌స్పాట్‌గా మారిన ఇండోర్‌లోని అక్క చెల్లెళ్ళ రాఖీలను అన్నదమ్ములకు అందించడం అనే సేవా కార్యక్రమం ద్వారా వారు రక్షాబంధన్ పండుగను మరచిపోలేని విధంగా చేశారు.

సేవా భారతి మాతృమండలి మాల్వా ప్రాంత సంయోజిక సునీతా తాయ్ మాట్లాడుతూ, లాక్‌డౌన్  సమయంలో, సోదరీమణులు బంగాళాదుంప చిప్స్, ఆమ్ పాపడ్, వెల్లుల్లి పచ్చడి, మినీ సమోసాలు వంటి అనేక ఆహార పదార్థాలను మంచి ప్యాకేజింగ్‌తో అమ్మడం ద్వారా, కరోనా కాలంలోనే, "మా అన్నపూర్ణ స్వయం సహాయక బృందం" సంస్థను స్థాపించి అనేక కుటుంబాలను ఆర్థిక సమస్యల నుండి రక్షించగలిగారని చెప్పారు.

జమ్మూ కాశ్మీర్‌లోని నగ్రోటా ఉదాహరణ దీనికి భిన్నంగా ఏమిలేదు, లాక్‌డౌన్ సమయంలో ఆర్థిక సంక్షోభం తీవ్రం అయినప్పుడు, వలస వచ్చిన కాశ్మీరీ పండిట్ల కోసం స్థాపించబడిన జగతి కాలనీలోని అంజలి దీదీ నాయకత్వంలో 100 కుటుంబాల సోదరీమణులు మాస్క్ లు, PPE కిట్లు కుట్టడం, ఊరగాయలు తయారు చేసి అమ్మడం ద్వారా, వారి ఇంటి ఖర్చులను వారే సంపాదించుకున్నారు.

కరోనా కాలంలో, మన సోదరీమణులు కోవిద్ పాజిటివ్ రోగులకు ఫోన్ చేసి వారి సమస్యలను పరిష్కరించడానికి మరియు వారి మనోధైర్యాన్ని పెంచడానికి ప్రయత్నించారు, ఒంటరిగా ఉన్న 70 ఏళ్ల వృద్ధురాలయిన ఒక అమ్మ, 2 రోజులుగా తన ఫోన్ రీఛార్జ్ అయిపోతుందని ఆందోళన చెందుతోంది, ఫోన్‌లో అపరిచిత మహిళ యొక్క మధురమైన స్వరం ద్వారా, - ఎలా ఉన్నారు???

మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా??? అని అడగగానే దేవుడే తనను ఆదుకున్నట్లుగా భావించింది.

భోపాల్ మహానగర మహిళా సహా సంయోజిక అభా పాండే దీదీ మరియు మాతృమండలి లోని ఆమె స్నేహితులు, "సేవా భారతి దూరభాష్ మిత్ర అభియాన్" అనే ఈ ప్రశంసనీయ కార్యక్రమం ద్వారా, కరోనా పాజిటివ్ రోగులు, కోవిడ్ లక్షణాలు గల వ్యక్తులు మరియు వృద్ధులతో సహా 1400 మంది జాబితాను సేకరించి వారికి 24 గంటల్లో ఫోన్‌కు రీఛార్జ్ చేయడం, మందులు పంపిణీ చేయడం, కరోనా పాజిటివ్ కుటుంబాలకు కౌన్సెలింగ్ చేయడం ద్వారా చాలా మంది మనసుల్లో వెలుగును నింపారు.

దేశవ్యాప్తంగా పనిచేస్తున్న సేవాభారతి సోదరీమణులు కూడా కొన్ని చోట్ల మెడికల్ హెల్ప్‌లైన్‌లను నిర్వహించారు. తెలంగాణ కార్యదర్శి జయప్రద దీదీ మాట్లాడుతూ - హైదరాబాద్‌లో నడుస్తున్న సేవాభారతి కోవిడ్-హెల్ప్ లైన్ కాల్ సెంటర్‌లో 50 మంది యువకులు, యువతులు మరియు మహిళల బృందం రోజుకు 16 గంటలు, వైద్యుల సహాయంతో ఇంటినుండే జలుబు, దగ్గు, జ్వరం మొదలైన వాటికి చికిత్స అందించడం, గర్భిణీ స్త్రీలకు సురక్షితమైన ఆసుపత్రుల గురించి తెలియచేయడం మరియు వాలంటీర్ల సహాయంతో ఇంట్లోనే కరోనా కిట్‌లను తయారు చేసి 500 మందికి పైగా కరోనా పాజిటివ్ రోగులకు పంపారు.

కాలం స్త్రీల సహనాన్ని పరీక్షించినప్పుడల్లా సవాళ్లను ఎదిరించి మహిళలు కొత్త శక్తిని పుంజుకున్నారనడానికి చరిత్రే సాక్ష్యం. దేశాన్ని చుట్టుముట్టిన కరోనా సంక్షోభంలో రాష్ట్రీయ సేవా భారతి, మాతృమండలి మహిళలు ఒక తల్లిగా, చెల్లిగా, కూతురిగా మారి కష్టజీవులకు ఆసరాగా నిలిచారు.

తదుపరి కథ వచ్చే సంచికలో.

192 Views
अगली कहानी