सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

5 mins read

జీవన ప్రవాహం (డోంగ్రిపాద, మహారాష్ట్ర)

సుబ్రహ్మణ్యం నేమాని | డోంగ్రిపాద | మహారాష్ట్ర

parivartan-img

డోంగ్రిపాద అంటే ఒక కొండపై ఉన్న చిన్న స్థావరం, ఇది చుట్టుపక్కల గ్రామం యొక్క స్థలాకృతిని కూడా వివరిస్తుంది. 33 కుటుంబాలతో కూడిన ఈ చిన్న స్థావరం, కలల నగరమైన ముంబైకి దగ్గరగా ఉండటం వల్ల ప్రయోజనం ఉండాలి, కానీ అలా లేదు. ఇక్కడ కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవు. ప్రజలు మంచి రోడ్లు, ముఖ్యంగా నీటి గురించి కలలు కన్నారు.

డోంగ్రిపద ముంబై నుండి కేవలం 80 కిలోమీటర్ల దూరంలో పాల్ఘర్ జిల్లాలో వుంది. గ్రామంలో త్రాగునీటి పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది, ప్రజలు కేవలం అందుబాటులో ఉన్న బావి నుండి నీటిని పొందడానికి, రాతి రహదారి గుండా 1.5 కి.మీ. కొండ దిగాలి, వర్షాలు కురిస్తే పరిస్థితి మరింత దిగజారుతుంది, ఆ కఠినమైన రోడ్డు కూడా మూసుకుపోతుంది. డోంగ్రిపాద సహజ సౌందర్యంతో సమృద్ధిగా ఉంటుంది, వర్షాలు కూడా పుష్కలంగా కురుస్తాయి, అయితే వర్షపు నీరు నిల్వ లేకపోవడం నీటి కొరతకు దారితీసింది. రైతులు తమ పొలాన్ని సాగు చేయలేకపోయారు.వ్యవసాయం చేయగలిగిన వారికి సరియైన ఆదాయం లేదు.చాలా మంది రైతులు సమీపంలోని సంసనే గ్రామంలో కూలీలుగా పనిచేశారు. సమీప ప్రాథమిక పాఠశాల తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది, పై చదువులు చదివే అవకాశమే లేదు. నీటి కొరతతో కేవలం ఏడుగురు రైతులు మాత్రమే తమ పొలాలను సాగు చేసుకోగలిగారు. రోడ్లు, కరెంటు, నీరు, ప్రభుత్వ కార్యాలయాలు మొదలగు మౌలిక వసతులు లేవు. ముంబై నగరానికి చెందిన మాజీ కార్యవాహ శ్రీ విమల్ కేడియా చొరవ తీసుకోవడంతో ఈ పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది.

 

విమల్ జీ మాట్లాడుతూ, తానొక ఆర్కిటెక్ట్ ని , కానీ డోంగ్రిపాడు నివాసితులు ఈ  కార్యక్రమం అమలులో సమానంగా కట్టుబడి ఉన్నారు. అన్ని ఇళ్లను పైప్‌లైన్‌తో అనుసంధానించే పని అయినా, లేదా కమ్యూనిటీ హాల్ సమాజ్ మందిర్” (సమాజ దేవాలయం) నిర్మించడం అయినా కావచ్చు. ముందుగా బావి నుంచి భారీ నీటి ట్యాంకు వరకు పైప్‌లైన్‌ వేసి, తర్వాత ప్రతి ఇంటిపైనా పైపులైన్లు, సోలార్‌ ప్యానెల్స్‌ అమర్చారు. సంఘ్‌ను స్థాపించిన శ్రీ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ జ్ఞాపకార్థం స్థాపించబడిన కేశవ సృష్టి ప్రాజెక్ట్, మొదటగా గ్రామ వికాస్ యోజన కింద నిధులు అందించబడ్డాయి. పూణేకు చెందిన ఒక ప్రైవేట్ కంపెనీ గ్రామ్ ఉర్జాపైపులు వేయడం, సోలార్ ప్యానెల్ ఫిక్సింగ్ యొక్క ప్రారంభ పనిని పూర్తి చేసింది. డోంగ్రిపాద తో సహా పది గ్రామాల అభివృద్ధికి ఇన్‌ఛార్జ్ అయిన కేశవ్ సృష్టికి చెందిన సచిన్ జీ మాట్లాడుతూ, అధిక భాగంలో వున్న ఖర్చులను మొదట కేశవ సృష్టి  ద్వారా వెచ్చించిన తరువాత, ప్రజలు మరింత అభివృద్ధికి తమవంతు సహకారం అందించారని వివరించారు. ఇందులో నీటిపారుదల ఏర్పాటు, దాని నిర్వహణ ఉన్నాయి.

కమ్యూనిటీ హాల్ ఎనిమిది కుట్టు మిషన్లతో కుట్టు తరగతి కేంద్రంగా పనిచేస్తుంది. ఈ మందిరం గ్రామస్తులకు పవిత్ర స్థలంగా మారింది, అన్ని కుటుంబాలకు ఉచితంగా ప్రవేశం కల్పించబడింది. వివిధ కుటుంబ, సమాజ కార్యక్రమాలు ఇక్కడ జరిగాయి. ఇది పిల్లల కోసం ఒక సాంస్కృతిక కేంద్రం మరియు లైబ్రరీ కూడా. SBI అందించిన రెండు కంప్యూటర్లతో కమ్యూనిటీ హాల్‌లో ఒక కంప్యూటర్ సెంటర్ కూడా పని చేస్తోంది. ఇక్కడ ప్రతి వారం భజన నిర్వహించబడుతుంది, ఇది స్థానికులను వ్యసనాలకు బానిసలు కాకుండా కాపాడింది. వార్లీ ప్రజలలో తాడి (ఒక రకమైన స్థానిక మద్యం) తాగేవారు మద్యపానం మానేసి, బదులుగా బియ్యం, కూరగాయలను పండించి మర్యాదగా సంపాదిస్తున్నారు.

ఈ గ్రామం వేగంగా  అభివృద్ధి చెంది ఇప్పుడు ఆస్ట్రోటర్ఫ్ (కృత్రిమ గడ్డి) అందిస్తోంది, మరియు విద్యుత్తుతో అనుసంధానించబడినది. ప్రధానంగా నీటి సమస్య పూర్తిగా పరిష్కరించబడింది. నీటి కోసం ఎదురుచూపులు ముగియడంతో డోంగ్రిపాద ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.ఈ నిరీక్షణ గంటలు లేదా రోజులు కాదు, డెబ్బై సంవత్సరాల పాటు కొనసాగింది. తన జీవితమంతా తాగునీటి కోసం వేచి చూసిన 73 సంవత్సరాల శాంతాబాయి వంటి నివాసితులు ఇక్కడ ఉన్నారు. గ్రామంలో నిర్మించిన వాటర్ ట్యాంక్ సంవత్సరం పొడవునా నీరు ఉండేలా చూస్తుంది. ప్రతి 8 ఇళ్ల మధ్య కుళాయిలు పంపిణీని సులభతరం చేసింది.

ప్రఖ్యాత రచయిత, శ్రీ రతన్ శారదా, అతని భార్య శ్రీమతి శ్యామా, డోంగ్రిపాద చేరుకుని, ఇంకా ఏమైనా సహాయం చేయాలా అని అడిగారు. తదుపరి సహాయం అవసరం లేదని, వారికి కావాల్సింది అందిందని, ఇకనుండి స్వతంత్రంగానే నిర్వహించుకుంటామని గ్రామస్థులు బదులిచ్చారు.

1688 Views
अगली कहानी