सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

చేనేత క్షేత్రంలో అక్షర సేద్యం

కిషన్ జీ మర్ల | మధ్యప్రదేశ్

parivartan-img

ప్రకాష్ రాధాకృష్ణన్ అనే 11 సంవత్సరాల పిల్లవాడు తన సోదరులైన రమేష్ మరియు బాలాజీ తో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రారంభించిన కాంచీపురం లోని రాత్రి బడికి వెళ్ళినప్పుడు అది అతని జీవితం లోనే కాక మొత్తం కాంచీపురం చేనేత కార్మికుల కుటుంబాలలో వెలుగు నింపుతుంది అనుకోలేదు. ఆ రాత్రి బడి అతని జీవితంలో భాగమై అతనికి మరియు కాంచీపురం చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగు నింపింది. తమిళనాడు రాజధాని అయిన చెన్నై కి 72 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంచీపురంలో నేత కార్మికుల జీవితాలు రెక్కాడితే గాని డొక్కాడని రీతిలో ఎంతో దయనీయంగా వుండేవి. 1981లో ఆర్ఎస్ఎస్ వారి అక్షర అభియాన్ ప్రారంభించే వరకు కూడా వీరి జీవితాలు ఎంతో దుర్భరంగా ఉండేవి. ముందునుండి అక్కడి నేత కార్మికుల నిరక్షరాస్యత వల్ల రుణదాతల చేతుల్లో మోసపోయేవారు.

ఈరోజు ప్రకాష్ మరియు అతని సోదరులు సొంతంగా ఉపాధి కల్పించుకుని నెలకు 30-35 వేల వరకు సంపాదిస్తున్నారు. ప్రకాష్ జీ ఆర్ఎస్ఎస్ తో మమేకమై ఉత్తర తమిళనాడు ప్రాంత సేవా ప్రముఖ్ గా ఎంతో కాలంగా సేవలందిస్తున్నారు. ఇప్పటికి కూడా వారు రాత్రి బడి తరగతులలో, అప్పటి శాఖా కార్యవాహ మూర్తి గారు బోధించిన తమిళ్,ఇంగ్లీష్,గణితం మరియు నీతి కథలు గుర్తు చేసుకుంటారు. మూర్తి గారు వారి జీవితంలోని 20 సంవత్సరాలు రాత్రి బడుల కొరకు కేటాయించారు.

"కాంచీపురంలో సేవా విభాగం రాకమునుపే నేత కార్మికులకు ఆర్ఎస్ఎస్ విభాగ్ ప్రచారక్ అయిన ధనుష్ జీ 30 సంవత్సరాల క్రితం 'తిరువళ్ళువార్ రాత్రి తరగతులు' ప్రారంభించారు" అని అప్పటి ప్రాంత సేవా ప్రముఖ్ అయిన సుందర్ లక్ష్మణ్ జీ అన్నారు. సుందర్ లక్ష్మణ్ జి ప్రస్తుతం అఖిల భారతీయ అధికారి గా ఉన్నారు, అప్పటినుండి గత 35 సంవత్సరాలుగా అక్షర అభిమాన్ నిర్విరామంగా కొనసాగుతున్నది. ఇప్పటివరకు ఈ అక్షర అభియాన్ 4 వేల నేత కార్మికులకు విద్యా దానం చేసింది. ఒకప్పుడు వేలిముద్రలతో సంతకాలు చేసే వారు నేడు వారి ఆర్థిక లావాదేవీలు వారే చూసుకో గలుగుతున్నారు.

ఈ అక్షర అభియాన్ 'తిరువళ్ళువార్ రాత్రి తరగతుల' కార్యక్రమ స్ఫూర్తి తో తమిళనాడు ప్రభుత్వం అక్కడ నేత కార్మికుల కోసం 33 రాత్రి బడులు ప్రారంభించారు. ఒకప్పుడు తమిళనాడులో అక్షరాస్యత కేవలం 15 % మాత్రమే ఉండేది, కానీ ఈ అక్షర అభియాన్ కార్యక్రమం వల్ల అక్కడి అక్షరాస్యత 60 % పెరగడానికి ఎంతో దోహదపడింది అని సుందర లక్ష్మణ్ జీ వివరిస్తారు. అందులో ఎంతో మంది నేత కార్మికుల కుటుంబాలలోని యువత పట్టభద్రులయ్యారు.

ప్రస్తుతం కాంచీపురంలోని నేత కార్మికుల కుటుంబాలు అక్షరాస్యతకు విలువనిచ్చి వారి ముందు తరాల ను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే దిశగా ప్రోత్సహిస్తున్నారు. అందుకు ఆర్ఎస్ఎస్ యొక్క అక్షర అభియాన్ ఎంతో దోహద పడింది అని అక్కడి నేత కార్మికులు అభిప్రాయపడతారు

789 Views
अगली कहानी