सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

డా. మాధవరావు పరాల్కర్ – సేవకు ప్రతిరూపం

కిషన్ జీ మర్ల | మధ్యప్రదేశ్

parivartan-img

పక్షవాతంతో బాధపడుతున్న ఒక పిల్లవాడు, చికిత్స కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసిన తర్వాత కూడా ఎటువంటి ఆశ కలగక నిస్సహాయ తల్లిదండ్రులుగా ఉండటం, ఊహించడానికే కష్టంగా ఉంటుంది. అప్పుడు ఒక సాధువు అక్కడికి వచ్చాడు, అతను ఒక్క పైసా కూడా వసూలు చేయకుండా పిల్లవాడికి వేళ్ళతో మసాజ్ చేసి ఫలితాలను చూపించాడు. పిల్లవాడు తన అవయవాలను కదిలించడం ప్రారంభించినప్పుడు దేవుడు పంపిన మర్దన మాయాజాలాన్ని పిల్లవాడి తల్లి చూసింది. మసాజ్ ట్రీట్మెంట్ చేసిన 6 గంటల తర్వాత పిల్లవాడికి స్పృహ వచ్చింది మరియు తల్లి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఇది కల్పితం కాదు, ప్రస్తుతం ముంబైలో ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ అయిన Mr.కాంచన్ నారంగ్ యొక్క నిజమైన హృదయపూర్వక కథ, మరియు భగవంతుని ప్రతి రూపమే డాక్టర్ మాధవరావు పరాల్కర్.

డాక్టర్ మాధవరావు పరాల్కర్ సంఘ ప్రచారక్ మరియు మానవత్వానికి ప్రతిరూపం. ఆయన అనేక మంది రోగులకు చికిత్స చేసారు  మరియు వారి బంధువులు, సంరక్షకులకు లాజిస్టిక్స్ మరియు ఇతర సహాయాన్ని కూడా అందించాడు. రుగ్న సేవా సదన్, డాక్టర్ పరాల్కర్ స్వయంగా స్థాపించిన (నానా పాల్కర్ స్మృతి సమితి) ముంబై వంటి నగరంలో పేద రోగులకు ఒక వరం

డా. పరాల్కర్ చాలా చిన్న వయస్సు నుండి స్వయంసేవక్ మరియు తెలివైన విద్యార్థి కూడా. 1947లో ఆయుర్వేద వైద్యునిగా డిగ్రీ పూర్తి చేసి, కొంతకాలం తన వృత్తిని అభ్యసించి పూర్తికాల సంఘ ప్రచారక్ అయ్యారు. అతను బాంద్రా నుండి విరార్ మరియు చెంబూర్లకు సైకిల్పై వెళ్లేవాడు. ఆయన వాక్చాతుర్యం మరియు మనోహరమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండడం వలన ప్రజలకు ముఖ్యంగా యువతకు ఆదర్శం గా నిలిచారు. విద్యార్థి పరిషత్లో జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీగా కొన్నాళ్లు కొనసాగారు. రోగుల పట్ల ఆయనకున్న అంకితభావం కారణంగా, పూర్వం సర్ సంఘచాలక్ శ్రీ గోల్వల్కర్ గురూజీ రుగ్న సేవా సదన్ స్థాపన బాధ్యతను ఆయనకు అప్పగించారు. ఇది పేద రోగులకు మరియు వారి బంధువులకు వసతిని అందిస్తుంది.

క్యాన్సర్ మరియు T.B వంటి వ్యాధుల చికిత్సలు (క్షయ) ఖరీదైనవి మరియు అధిక కాలం ఉంటాయి. రోగులు ఆసుపత్రిలో ఉచిత భోజనాన్ని పొందుతారు కానీ సంరక్షకులకు ముంబయి వంటి నగరంలో ఆహారం మరియు ఆశ్రయాన్ని పొందడం కష్టం. నానా పాల్కర్ స్మృతి సమితి (రుగ్నా సేవా సదన్) అనేది టాటా మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ నుండి దాదాపు అర కిలోమీటరు దూరంలో సౌకర్యవంతమైన పది అంతస్తుల భవనం, పేద రోగులకు నిలయంగా ఉంది. రూ.10 సరసమైన ధరకే భోజనం, రోగులకు మరియు వారి సంరక్షకులకు ఒక నెల ఉచిత వసతి కల్పిస్తుంది. సేవా సదన్ను నిర్మించేందుకు డాక్టర్ పరాల్కర్ ఎంతో కృషి చేశారు. అనేక మంది సహాయం తీసుకున్నారు. ఆయన చాలా మంది స్వయంసేవక్లను మరియు వారి కుటుంబ సభ్యులను చిన్న విరాళంగా రూ. 500 దానం చేయవసిందిగా పిలుపు నిచ్చారు, మరియు అదే సమయంలో బిర్లా ఫౌండేషన్ నుండి లిథోట్రిప్సీ మెషిన్ రూపంలో రూ. 75 లక్షలు విరాళం కూడా వచ్చింది. అతను తన ఆసుపత్రిలో రోగులకు ఉచిత లేజర్ శస్త్రచికిత్స మరియు వసతి కోసం ముంబైలో పెద్ద పేరున్న డాక్టర్ అజిత్ ఫడ్కేని ఒప్పించారు. డాక్టర్. పరాల్కర్ యొక్క మరొక ఆలోచన గోఖలే డయాలసిస్ సెంటర్ లో 14 డయాలసిస్ మెషిన్స్ ఉన్నాయి, ఇవి వివిధ షిఫ్టులలో పేద రోగులకు ఉచిత డయాలసిస్ను అందిస్తాయి.

డాక్టర్ పరాల్కర్ యొక్క అచంచలమైన భక్తి కారణంగా, ముంబై హాస్పిటల్ డీన్ అయిన డా. గోయల్తో సహా ముంబైలోని ప్రముఖ మరియు పెద్ద వైద్యులందరూ సాధారణ ధోతీ కుర్తా ధరించిన ఆర్వేద వైద్యుడికి సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు. డాక్టర్ పరాల్కర్ యొక్క సహచరుడు మరియు సేవా సదన్ ట్రస్టీ శ్రీ వివేక్ ఛత్రే ప్రకారం, డాక్టర్ పరాల్కర్ ముంబైలోని వైద్య ప్రముఖులలో ఒకరు.


మానవాళికి సేవ చేసే మార్గంలో, రుగ్నా సేవా సదన్ మరియు గోఖలే డయాలసిస్ సెంటర్ స్థాపనలలో అతను తన జీవితంలోని ప్రతి నిమిషాన్ని వెచ్చించాడు. ఎమర్జెన్సీ సమయంలో తోటి ఖైదీలకు యోగా, వివిధ మసాజ్ టెక్నిక్స్ నేర్పించడాన్ని బట్టి ఆయనలో ఎనలేని స్ఫూర్తిని అర్థం చేసుకోవచ్చు. ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకుండా తన మాయా మసాజ్తో చాలా మందికి చికిత్స చేసారు. అనేక మంది జీవితాలలో భాగమైన ఆయన, NPSS (నానా పాల్కర్ స్మృతి సమితి) యొక్క ఏడు అంతస్తులను పూర్తి చేసిన తర్వాత, 81 సంవత్సరాల వయస్సులో 22 ఫిబ్రవరి 2008 కన్నుమూశారు.

756 Views
अगली कहानी