सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

నిజమైన కర్మ వీరుడు - అజిత్ జీ

డా. శాంతా ఠాకూర్ | బెంగళూరు.

parivartan-img

.23 ఏళ్లకే ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్‌లో గోల్డ్ మెడల్, అది కూడా 65 ఏళ్ల క్రితం. ఈ ప్రతిభావంతుడైన యువకుడి గురించి భవిష్యత్తే ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తుందనడంలో సందేహం లేదు, కానీ అతని కలలు ప్రపంచం మొత్తానికి భిన్నంగా ఉన్నాయి. బహుశా చరిత్ర లిఖించేవాళ్ళు మామూలు మార్గాన్ని ఎంచుకోరు, కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా గుడిబండేకు చెందిన గెజిటెడ్ అధికారి బ్రహ్మసూరయ్య, ఆయన భార్య పుట్టతాయమ్మ దంపతుల రెండో సంతానం అజిత్ కుమార్ జీ చేసింది ఇదే. పెద్ద కంపెనీలో ఉద్యోగంలో చేరకుండా 1957లో రాత్రికి రాత్రే ఇంటి నుంచి వెళ్లిపోయి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రచారకుడిగా మారారు. సంఘ్ యొక్క విశిష్ట ప్రచారకులలో ఒకరైన అజిత్ జీ అచిర కాలంలో బెంగళూరులో సేవా రంగంలో ఒక ఏకైక మోడల్ హిందూ సేవా ప్రతిష్ఠాన్‌ను స్థాపించారు. ఇది చాలా కొత్త భావనలకు జన్మనిచ్చింది. శిక్షణ ఇవ్వడం ద్వారా సేవ చేయగల వ్యక్తులు కూడా తయారవుతారు, మహిళలకు కూడా శిక్షణ ఇవ్వడం ద్వారా తమ సహజమైన సేవా గుణాన్ని గుర్తెరిగి సమాజానికి మెరుగైన సేవలు అందించగలరు, ఈ దృక్పథాన్ని గ్రహించి, సంఘ సమ్మతితో 1980 లో "హిందూ సేవా ప్రతిష్ఠాన్" సంస్థ ద్వారా సేవకులు కావాలనుకునే 23 మంది యువతీ యువకులతో కూడిన మొదటి బ్యాచ్‌కు 40 రోజుల శిక్షణను ప్రారంభించింది.

 

నేలే, అరుణ్, చేతన, ప్రసన్న కౌన్సెలింగ్ సెంటర్, సేవామిత్ర, సుప్రజ మొదలైన అనేక ప్రాజెక్టులను నిర్వహిస్తున్న వాలంటీర్లందరూ ఇక్కడి నుంచే శిక్షణ పొందారు. దివంగత అజిత్ జీ కాన్సెప్ట్ ఇప్పుడు ఒక వట వృక్షంలా మారింది. ప్రారంభించిన 42 సంవత్సరాలలో, 4000 మందికి పైగా ఇక్కడ నుండి శిక్షణ లభించింది మరియు వారు సేవకు తమ జీవితాన్ని అంకితం చేశారు, వారిలో 3500 మంది మహిళలు ఉన్నారు. వీరిలో చాలా మంది తమ యవ్వనంలో 3-10 సంవత్సరాలు మరియు కొందరు తమ జీవితమంతా సేవకు అంకితం చేశారు.

 బెంగళూరులో బీఈ చేస్తూ కంబన్ పేట్  కల్యాణ్‌శాఖ నుంచి సంఘ జీవితాన్ని ప్రారంభించిన అజిత్‌జీ ఇక వెనుదిరిగి చూసుకోలేదు. సంఘ్ పరిచయం కొంచం ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ, కళాశాల జీవితంలో ప్రాథమిక శిక్ష వర్గ తర్వాత అతని జీవిత దిశ మారిపోయింది. తన కళాశాల జీవితంలో విద్యార్థి మండలిలో పనిచేస్తున్నప్పుడు కూడా, పేదరికంతో బాధపడుతున్న తన బంధువుల జీవితాలను మెరుగుపరచడంపై శ్రద్ధ వహించాడు.

 

1957లో సంఘ్ ప్రచారక్ గా మారి, ఆయన 1960-75 వరకు సంఘ్ యొక్క వివిధ బాధ్యతలను నిర్వర్తిస్తూ, ఎమర్జెన్సీ సమయంలో మిసా (MISA) ఖైదీగా 2 సంవత్సరాలు జైలులో ఉన్నాడు. అక్కడ కూడా ఖైదీలకు యోగా శిక్షణ ఇచ్చారు. సంఘ్ శిక్షా వర్గలో యోగాను చేర్చిన ఘనత కూడా అజిత్ జీకే చెందుతుంది. ఇందుకోసం ప్రముఖ యోగాచార్య శ్రీ పట్టాభి గారి వద్ద యోగా నేర్చుకున్నారు.

హిందూ సేవా ప్రతిష్ఠాన్‌లో సేవకుల శిక్షణ కోసం పాఠ్యాంశాలను రూపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన అజిత్ జీ కి సహచరుడుగా ఉన్న RSS ప్రస్తుత సర్ కార్యవాహ అయిన శ్రీ దత్తాత్రేయ హోసబాలే జీ మాట్లాడుతూ... లక్షలాది మంది ప్రజలకు సేవ చెయ్యటానికి ఉన్న వారి సంఖ్య వేళ్లపై లెక్కించవచ్చు అని, అంతేకాకుండా సేవ అనే సహజ స్వభావం ఉన్న స్త్రీ కూడా సేవకు దూరంగా ఉన్నారు అని అజిత్ జీ నిరంతరం ఆందోళన చెందేవారని అన్నారు. బహుశా ఆయన ఈ బాధే సేవా భావనకు జన్మనిచ్చింది. అంటే సేవ కోసం మంచి వ్యక్తులను సృష్టించి, వంచిత సమాజ ఉద్ధరణలో వారిని నియమించడం. దీని కోసం ఇక్కడ శిక్షణ పొందుతున్న వారికి భారతదేశం యొక్క వైభవమైన పరంపర, మహనీయుల జీవిత చరిత్రలు, సేవ యొక్క ఆవశ్యకత, యోగా మరియు క్రమశిక్షణ వంటి అనేక విషయాలపై 40 రోజుల శిక్షణ ఇస్తుంది. దీని తరువాత, సేవకులు సమాజంలో వారి ఆసక్తికి అనుగుణంగా 3 సంవత్సరాలు సేవ చేయటానికి  కేటాయిస్తారు. ఈ కాలంలో, సంస్థ వారి వసతి మరియు ఆహారంతో పాటు గౌరవ వేతనంగా కొంత మొత్తాన్ని ఇస్తుంది. యవ్వనంలో మూడేళ్లు తమ జీవితాన్ని సేవకే అంకితం చేసిన తర్వాత చాలా మంది సేవాకార్యకర్తలు తమ జీవితమంతా సేవకే అంకితం చేస్తారు.


1989లో ఇక్కడి నుంచి శిక్షణ పొంది, మహిళా విభాగం డైరెక్టర్‌గా చాలా సంవత్సరాలు పనిచేసిన వనితా హెగ్డే జీ మాట్లాడుతూ, అజిత్ జీ ఈ సంస్థ స్థాపించిన తర్వాత తొమ్మిదేళ్లు మాత్రమే జీవించారని, అయితే ఈ తొమ్మిదేళ్లలో ఆయన ప్రాజెక్ట్ విజయవంతం చేయడంలో తన శక్తినంతా ఉపయోగించారని, శిక్షణ సమయంలో ఆయన మొత్తం సమయం అక్కడే ఉండేవారని మరియు శిక్షణలో ఉన్న వారందరితో సన్నిహిత సంబంధాన్ని పెంచుకునేవారని, సేవా బస్తీలో ఎవరు పని చేయగలరు? యోగా సెంటర్‌లో ఎవరి సామర్థ్యాలను ఉపయోగించవచ్చో ఆయనకి బాగా అర్థమై ఉండేదని, ఉద్యోగులకు సరైన స్థానం కల్పించడమే కాకుండా వారు అక్కడ సక్రమంగా పని చేసేలా చేయడంలో కూడా ఆయన ముఖ్య పాత్ర ఉండేదని. ఆయన క్షేత్రానికి వెళ్లి ప్రతీ సేవక్, సేవిక తో పాటు సేవ లో పాల్గొనటానికి ప్రయత్నించారని, ఆయన సహజమైన స్నేహ గుణం మరియు బలమైన ఆలోచనలతో ప్రభావితమై, చాలా మంది యువకులు మరియు యువతులు జీవితకాల సేవలో ప్రతిజ్ఞ చేయడానికి ప్రేరణ పొందారని అన్నారు. హిందూ సేవా ప్రతిష్ఠాన్ మొదటి డైరెక్టర్ అజిత్ జీ తన సహచరులతో కూడా సేవ చేయడానికి మంచి వ్యక్తిని వ్యక్తిత్వాన్ని నిర్మించాలనే భావన ప్రచారం చేశారు.

కానీ క్రూరమైన విధి ఆయనను అకస్మాత్తుగా మన నుండి దూరం చేసింది, కేవలం 56 సంవత్సరాల వయస్సులో, అతను 3 డిసెంబర్ 1990 తెల్లవారుజామున 4 గంటలకు బెంగళూరు సంఘ కార్యాలయం కేశవ కృప నుండి తుమకూర్ వెళుతుండగా కారు ప్రమాదంలో మరణించారు. ఆయనకు నివాళులు అర్పిస్తూ, నానాజీ దేశ్‌ముఖ్ గారు మాట్లాడుతూ, 16 సంవత్సరాల వయస్సులో, ఒక అమ్మాయి సేవలో చేరడానికి ఒక ఫారమ్ నింపి, స్వయంగా శిక్షణ తీసుకుంటుందని ఆ విషయం నమ్మడం ఉత్తర భారతదేశానికి కష్టమని, కానీ అజిత్ జీ అసాధ్యమైన ఆలోచనను మరియు ఆచరణను, ఒక విజయవంతమైన ప్రాజెక్ట్‌గా గ్రహించారు అని అన్నారు.

316 Views
अगली कहानी