सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

నలబై గ్రామాల (ఛత్తీస్గఢ్) అభివృద్ధికి మూలకారణం- గౌముఖి సేవా ధామ్

కిషన్ జీ మర్ల | మధ్యప్రదేశ్

parivartan-img

దేవ్పహారి, ఛత్తీస్గఢ్లోని కోర్బా జిల్లా నుండి 60 కి.మీ దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం. పద్దెనిమిదేళ్ల క్రితం దేవ్పహరి చేరుకోవడం హిమాలయాలను అధిరోహించినంత కష్టం. గ్రామం చేరుకోవడానికి ట్రెక్కింగ్ చేస్తూ మూడు లోయలు దాటాలి, కొన్నిసార్లు రెండు రోజుల సమయం పడుతుంది కూడా. దేవ్పహరీ మాత్రమే కాదు, కోర్బా జిల్లాలోని లెమ్రు, దిదసరాయ్, జటాదాద్తో సహా నలభై గ్రామాలకు చేరుకోవడానికి రోడ్డు లేదా ప్రభుత్వ వాహనం లేదు. చదువుకోవడానికి స్కూల్ లేదు, వైద్యం కోసం దగ్గరలో డాక్టర్ లేడు. కరెంటు విషయానికొస్తే ఇప్పటికీ కరెంటు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. పాండో, బిర్హోర్, కోర్వా, కన్వర్ తెగలకు చెందిన ఆదివాసీ సమాజంలోని రోగులు, అటవీ ఉత్పత్తులపై ఔషదాలపై ఆధారపడి జీవించేవారు, దేవుడిపై మాత్రమే ఆధారపడేవారు. వారిపై నక్సలైట్ల భీభత్సం జీవితాన్ని కష్టతరం చేసింది. ఎదిగిన పంటను నాశనం చేసేవారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న గిరిపుత్రులను సమాజంలోని ప్రధాన స్రవంతితో అనుసంధానించడానికి స్థానిక స్వయంసేవకులు చొరవ తీసుకున్నారు. నేటి నుండి 22 సంవత్సరాల క్రితం, 15 సెప్టెంబర్ 2000, నానాజీ దేశ్ముఖ్ జీ స్ఫూర్తితో, దేవ్పహారిలో గౌముఖి సేవాధామ్ స్థాపించబడింది. దేవ్పహారిని కేంద్రంగా చేసుకుని సమీపంలోని 40 గ్రామాల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించారు. బన్వారీ లాల్ అగర్వాల్, కిషోర్ బుటోలియా, డా. ధృవ్ బెనర్జీ, పిఎన్ శర్మ వంటి సంఘ్ స్వయంసేవకులు, ఇందు దీదీ వంటి సేవాదృక్పథం ఉన్న మహిళలు ఇక్కడ కొన్నాళ్లు జీవితాన్ని గడిపి నలభై గ్రామాలలో గ్రామాభివృద్ధికి శ్రీకారం చుట్టారు. సంస్థ వనవాసీలకు అధునాతన వ్యవసాయం ఎలా చేయాలో నేర్పించడమే కాకుండా వారి ఆదాయాన్ని పెంచడానికి అన్ని చర్యలను కూడా తీసుకుంది. తన పిల్లలకు చదువు చెప్పేందుకు పాఠశాలను, రోగుల కోసం ఆసుపత్రిని కూడా ప్రారంభించారు. యువతకు ఉపాధి కోసం శిక్షణ ఇచ్చి, మహిళలకు ఆత్మగౌరవంతో జీవించడం నేర్పారు.



జటాదాద్ సర్పంచ్ అమృతలాల్ రాఠీ ఎన్నో ప్రయత్నాలు చేసినా తన గ్రామంలో ప్రాథమిక పాఠశాల తెరవలేకపోయారు. చుట్టుపక్కల గ్రామంలో నడుస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఉపాధ్యాయులు కనిపించడం అరుదు. కానీ ఆయన కుమారుడు జ్ఞాన్ రాఠి రాయ్పూర్లో మెకానికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పూర్తి చేసినప్పుడు, ఆయన మొదట స్వీట్లతో గౌముఖి కార్యాలయానికి వెళ్లారు. ఎన్నో ఏళ్లుగా సేవాధామ్ కార్యకర్తలు ఎన్నో కష్టాల మధ్య కూడా అత్యంత అంకితభావంతో పని చేయడం చూసిన వారిలో అమృత్లాల్ జీ ఒకరు. ఏకలవ్య విద్యా మందిర్, సేవాధామ్ నిర్వహిస్తున్న ఉన్నత పాఠశాల, జ్ఞాని వంటి వందలాది గిరిజన పిల్లలకు చదివించి ఎంతో ముందుకు తీసుకువచ్చింది. నేటికీ 300 మంది పిల్లలు పాఠశాల యొక్క హాస్టల్ మమత్వ మందిర్లో వుంటూ చదువుతున్నారు, మరియు పాఠశాలలో ఇప్పటివరకు చదువుతున్న వారి సంఖ్య 1000 మందికి పైగా ఉంది. సంస్థ ఇక్కడ చదువుతున్న పిల్లల్లో సేవా భావాన్ని కూడా నింపింది. ఇక్కడే ఉండి చదువుకుని ఇప్పుడు ప్రిన్సిపాల్గా ఉన్న పురుషోత్తం వురవాన్ తనలాంటి పిల్లలను ప్రోత్సహించడంలో నిమగ్నమై ఉన్నాడు.



ఇప్పుడు ప్రజలు తమ దేవుడిగా భావించే డాక్టర్ దేవాశిష్ మిశ్రా గారు మరియు అతని భార్య డాక్టర్ సరితగారి గురించి తెలుసుకుందాం. గత 18 సంవత్సరాలలో, డాక్టర్ దంపతులు కఠినమైన అడవి మధ్యలో ఉన్న చిన్న ఆసుపత్రి ఆరోగ్య మందిర్లో వందలాది మందికి జీవితాన్ని ప్రసాదించారు. ఆసుపత్రి ద్వారా ప్రతి సంవత్సరం లక్షలాది మందులు ఉచితంగా అందజేస్తున్నారు. సంస్థ కార్యదర్శి మరియు సంఘ్ స్వయంసేవక్ అయిన గోపాల్ అగర్వాల్ మాట్లాడుతూ - ఇంతకుముందు ప్రజలు రోగిని మంచం లేదా సైకిల్పై తీసుకువచ్చేవారు, ఇప్పుడు 24 గంటలు ఆసుపత్రి అంబులెన్స్ అందుబాటులో ఉంది. ఇదొక్కటే కాదు, ఇప్పుడు ప్రతి 15 రోజులకు, ప్రాంతంలోని గ్రామాల్లో వైద్య శిబిరాలు కూడా నిర్వహించబడుతున్నాయి, దీనివల్ల పోషకాహార లోపం సమస్య పరిష్కరించబడింది అంతేకాకుండా మాతా మరియు శిశు మరణాలు కూడా తగ్గాయి


గౌముఖి సేవా ధామ్ యొక్క అతిపెద్ద విశేషం వారి సొంత పవర్ హౌస్. చోర్నయి నదిపై ఒక చిన్న ఆనకట్టను నిర్మించడం ద్వారా, హైడ్రో-ఎలక్ట్రిసిటీ ద్వారా ప్రతిరోజూ 5KW విద్యుత్ ఉత్పత్తి చేయబడుతుంది, ఇది హాస్టళ్లు మరియు ఆసుపత్రులతో సహా కార్యకర్తల ఇళ్లకు కూడా సరిపోతుంది. కాగా నేటికీ ప్రాంతానికి కరెంటు తీగలు కానీ, బీఎస్ఎన్ఎల్టవర్కానీ రాలేదు. సంస్థ ప్రెసిడెంట్ ఇందు దీదీ ప్రకారం, పరిస్థితుల ప్రభావంతో బాధపడుతూ నక్సలిజం మార్గం లో నడిచే వారికి సంతోషకరమైన మరియు స్వావలంబనతో కూడిన జీవితాన్ని అందించడం ద్వారా, సేవాధామ్, కోర్బాను మరో బస్తర్ (నక్సలిజం యొక్క కంచుకోట) కానీయలేదు.

563 Views
अगली कहानी